ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కమిషన్ చెప్పకుండా ఎలా అమలుచేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 07:19 PM

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని పేర్ని నాని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది.. ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదన్నారు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందని పేర్ని నాని అన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని ఆడిగామని తెలిపారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa