కడప జిల్లా, మదనపల్లె స్థానిక ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీవారికి పుష్పయాగం కన్నుల పండువగా జరిగింది. దీంతో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. అంత కు ముందు ఉదయాన్నే సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొల్పి అర్చనలు, అభిషేకా లు, విశేషపూజలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం వార్షిక బ్రహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో రమణ, మాజీ ఆలయకమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa