ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మెజార్టీ సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 సీట్లలోనే ఆధిక్యంలో ఉండగా.. 125+ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ( అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. జూన్ 1న పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఈ ఫలితాల్లో అచ్చంగా ప్రతిబింభిస్తుండటం గమనార్హం. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలన జ్యోతిష్యుడుగా పేరుపొందిన వేణుస్వామి.. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు వేణుస్వామి.
"2019 ఎలక్షన్ల తర్వాత 2, 3 ఏళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోలికి వెళ్లవద్దని టీడీపీకి చెప్పాను. ఎన్నికలకు రెండేళ్ల ముందు వచ్చి వైఎస్ జగన్ పాలనపై మాట్లాడమని చెప్పా. కానీ టీడీపీ వాళ్లు మొదటిరోజు నుంచి జగన్ మీద విమర్శలకు దిగింది. జ్యోతిష్యం అనేది 88 శాతం కరెక్ట్ అయితే.. 12 శాతం స్వయంకృతాపరాధాలు పనిచేస్తాయి. టీడీపీ డ్యామేజ్ కావటానికి జాతకాల కంటే స్వయంకృతాపరాధమే పనిచేసింది. ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా టీడీపీ గెలుస్తుందనే వైబ్ ఏపీలో ఉంది. కానీ కూటమి ప్రకటించాక.. మొత్తం టర్న్ తీసుకుంది" అని వేణుస్వామి చెప్పారు.
అయితే.. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు వేణుస్వామి చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ.. వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమైంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే.. వేణుస్వామి చెప్పిన మాటల్లో.. జ్యోతిష్యం అనేది 88 శాతం కరెక్ట్ అయితే.. 12 శాతం స్వయం కృతాపధాలు పనిచేస్తాయని చెప్పిన మాటను హైలైట్ చేస్తూ.. ఇప్పుడు అవే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముంచేశాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు తెలంగాణలో అయినా.. ఇటు ఏపీలో అయినా.. పార్టీల స్వయంకృతాపరాధాలే ఓటమికి కారణాలవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa