ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గంలో నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నియమించారు. ఈ నియామకంపై జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంతోపాటు, జిల్లా అభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. పశ్చిమలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకులోనే కొద్దిపాటి పరిశ్రమ లున్నాయి. విదేశాలకు ఎగుమతులు చేసే లేసు పరిశ్రమ నర్సాపురం ప్రాంతంలో గతంలో మంచి జోష్ మీద ఉండేది. ఇప్పుడది పతనమైంది. లేసు పరిశ్రమకు మళ్లీ మంచి రోజు లు రావాలంటే కేంద్ర సహకారం అవసరం. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. డెల్టాలో ఆక్వా రంగం అభివృద్ధి చెందింది. ఆ రంగంలోనూ మరిన్ని యూని ట్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలతో యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa