ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువయ్యాయి. అప్పటివరకు చాలా యాక్టివ్గా ఉన్న వారే చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తున్న సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. గుండె పోటు కారణంగా క్షణాల్లో మృతి చెందుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోవడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి.. విధులు నిర్వర్తిస్తుండగానే.. బ్యాంకులో కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనంగా మారింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తర్ప్రదేశ్ మహోబాలోని ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు ల్యాప్టాప్లో పనిచేసిన అగ్రికల్చరల్ జనరల్ మేనేజర్ 30 ఏళ్ల రాజేష్ కుమార్ షిండేకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ల్యాప్టాప్లో పనిచేయడం ఆపేసి.. తాను కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలాడు. అంతే ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే కుర్చీలో కుప్పకూలిపోయాడు. అయితే మొదట ఆ సంఘటనను గుర్తించని.. తోటి ఉద్యోగులు.. రాజేష్ కుమార్ షిండేకు గుండె పోటు వచ్చిన విషయాన్ని గమనించారు. వెంటనే మిగితా ఉద్యోగులను అలర్ట్ చేశారు.
రాజేష్ కుమార్ షిండేను.. ఆ డెస్క్లోని కుర్చీలో నుంచి తీసి బయటికి తీసుకువచ్చారు. ముఖం మీద నీళ్లు చల్లి.. సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కించే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి ఫలించలేదు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే గుండె పోటుతో రాజేష్ కుమార్ షిండే.. కుప్పకూలిపోయి దృశ్యాలు ఆ బ్యాంక్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa