గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.... ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి నివేదించారు. సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును లోకేష్ కోరారు. గత అయిదేళ్ళు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa