చీరాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పిస్తాం.. ఎవరినీ ఇబ్బంది పెట్టం.. వివాదాలు వద్దు... అభివృద్ధే ముద్దు అని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఏదన్నా సమస్యలుంటే తనకు నేరుగా చెప్తే ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామన్నారు. రోటరీ కమ్యూనిటీ హాలులో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ అధ్యక్షతన ఎమ్మెల్యే కొండయ్యకు ఆత్మీయ సన్మాన సమావేశం నిర్వహంచారు. సన్మానగ్రహీత కొండయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిలో పోటీ పడదామన్నారు. ఒక క్రమపద్ధతిలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్యాచరణతో అడుగులు వేస్తున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ఉపాధి రంగాలను మెరుగుపచడం, టెక్స్టైల్ పార్కుల, టూరిజం అభివృద్ధి ఇలా ఒక్కొక్కటీ దశలవారీ గా సత్ఫలితాలు సాధించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా వాక ర్స్ అసోసియేషన్ ప్రతనిధులు అన్న క్యాంటీన్ ఏర్పాటు, నిర్వహణలో తమవంతు భాగస్వామ్యంగా రూ.50వేల విరాళాన్ని ఎమ్మెల్యే కొండయ్యకు అందజేశారు. త్వరలోనే అన్న క్యాంటీన్ పునఃప్రారంభమవుతుందని కొండ య్య తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa