ల్యాండ్ స్కామ్లో హేమంత్ సోరెన్ ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అరెస్టుకు ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ వెంటనే చంపాయి సోరెన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. సుమారు 5 నెలల పాటు జైలులో ఉన్న హేమంత్ సోరెన్కు జూన్ 28న జార్ఖాండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చంపయి సోరెన్ నివాసంలో జేఎంఎం, కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోరెన్ను జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. కాంగ్రెస్ జార్ఖాండ్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసత్, భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా సోరెన్ కోరడంతో గవర్నర్ నుంచి పిలుపు అందగానే సోరెన్ తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపడతారని జేఎంఎం వర్గాలు తెలిపాయి. దీంతో 2020 నవంబర్ 15న బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖాండ్ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సోరెన్ పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa