సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సచివాలయ ఉద్యోగులను పెడన మునిసిపల్ కమిషనర్ బి.వెంకట్రామయ్య హెచ్చరించారు. బుధవారం ఉదయం పట్టణంలోని 1వ సచివాలయానికి 10.30 గంటలకు తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో సిబ్బందిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa