ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈయన ఏం చేసినా సంచలనమే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండాల్సిందే. అంతలా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జనసేన కార్యకర్తలు, అభిమానుల అంచనాలకు అనుగుణంగా పాలనతో తన మార్క్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాను చేపట్టిన కీలక మంత్రిత్వశాఖల మీద సమీక్షలు, సర్వేలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విలేకర్ల సమావేశంలో అసహనంతో మైక్ విసిరిగొట్టి వెళ్లిపోయినట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం ఆ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ చేతిలోని మైక్ కింద పెట్టేసి వేగంగా వెళ్లిపోయారు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మైక్ పనిచేయకపోవటంతో.. ఇంట్రెస్ట్ పోయిందని పవన్ కళ్యాణ్ మైక్ విసిరేసి వెళ్లిపోయారంటూ కొందరూ.. సుగాలి ప్రీతి కేసుపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారంటూ మరికొందరు.. ఇలా ఎవరికి తగినట్లు వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అయితే ఎక్కువగా వైసీపీ శ్రేణుల నుంచే ఈ తరహా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు అసలు విషయం ఇదీ అంటూ దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను షేర్ చేస్తున్నాయి. మైక్ విసిరేసి పవన్ కళ్యాణ్ వెళ్లిపోలేదని.. మైక్ అక్కడే ఉంచి.. ముందు ఉన్న పోడియం వద్ద నుంచి మాట్లాడారని వీడియోను షేర్ చేశాయి.పూర్తి వీడియోను షేర్ చేయకుండా.. ట్రిమ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శిస్తున్నాయి,
మరోవైపు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 4,976 కోట్లతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. 250కి పైగా జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని ఆదేశించారు. ఇక పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్న పవన్ కళ్యాణ్.. వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. ఏటా రూ.243 కోట్ల విలువైన వ్యర్థాలను పడేస్తున్నామన్న పవన్ కళ్యాణ్.. సరైన నిర్వహణ ఉంటే చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa