సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోట్లను బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను టీడీపీ కూటమి ప్రభు త్వం సమర్ధవంతంగా సరి చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ ప్రజల జీవితాల్లో వెలు గులు నింపుతున్నారని అన్నారు. కూటమి నాయకుల సహకారంతో డోన్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య దర్శి కోట్రికే ఫణిరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, డోన్ అసెంబ్లీ కన్వీనర్ సంధు రమణ, బొగ్గరపు నటరాజ్, కిరణ్, రవి కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa