నంద్యాల జిల్లా ముచ్చు మర్రి గ్రామంలో వాసంతిని అత్యాచారం, హత్యకు పాల్పడిన, సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. వాసంతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్య, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి బీసన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ, శ్రావణి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.... వాసంతి అనే 8 ఏళ్ల బాలికను ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. బాలిక శవాన్ని బాలుర తల్లిదండ్రులు మాయం చేశారన్నారు. పది రోజుల నుంచి మృతదేహం లభించకపోవడం చాలా బాధాకరమన్నా రు. నిందితులకు కఠిన చర్యలతో పాటు వాసంతి మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో మహిళ సమైఖ్య నగర నాయకులు రేణుకమ్మ, విజయ, సువర్ణమ్మ, సుశీల, ఏఐవైఎఫ్ నగర నాయకులు చంటి, సురేంద్ర యాదవ్, రాజశేఖర్, రాముడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa