ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపిల్లలకి ఈ ప్రభుత్వంలో రక్షణ ఎక్కడ...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 08:55 AM

ఆడపిల్లల రక్షణ అనేది మీ కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత లేని అంశమా? అని శ్రీమతి వరుదు కళ్యాణి నిలదీశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ లాంటి వారు అంబానీ ఇంట పెళ్లికి వెళ్లారని, రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లాలని ఎందుకు అనిపించలేదని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని హోం మంత్రి అనిత చెప్పారన్న.. శ్రీమతి వరుదు కళ్యాణి, సాక్షాత్తూ ఆమె నియోజకవర్గంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. హోం మంత్రి నియోజకవర్గంలో ఇద్దరు మహిళల బట్టలు చించిన టీడీపీ నాయకులు వారిని రోడ్డుపై ఈడ్చారని, అదే అనకాపల్లి జిల్లాలోని  రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయిని గొంతు కోసి చంపేశారని, ఆ చంపిన సురేష్‌ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్టయ్యి విడుదలైతే దర్శిని కుటుంబ సభ్యులు మూడుసార్లు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. కనీసం అక్కడ పోలీసులు స్పందిచని పరిస్థితి ఉందన్నారు. దాన్ని అలుసుగా తీసుకుని ఆ దుర్మార్గుడు ఇంటికొచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అదే జిల్లాలో సన్మానానికి వెళ్లిన హోంమంత్రి అనిత.. ఈ బాధితురాలి పోస్టుమార్టం పక్కనే జరుగుతుంటే కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa