నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ లభించ లేదు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విజయవాడ, ఏలూరు జిల్లాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కాల్వ వద్ద ఎంపీడీవో చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్లతో కాల్వ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ దొరక లేదు. నరసాపురం రేవు నిర్వహణదారుడు రెడ్డప్ప ధేవేజీ మండల పరిషత్కు రూ.55 లక్షల వరకు చెల్లించాలి. ఈ బాకీ వసూలు విషయమై ఆయన రెండు నెలల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నెల 3 నుంచి మెడికల్ లీవ్ పెట్టి కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన ఇంటి వద్దనే ఉంటున్నారు. 17 వ తేదీ సోమవారం మచిలీపట్నం వెళ్లిన ఎంపీడీవో ఇంటికి తిరిగి రాలేదు. ఎంపీడీవో సెల్ నుంచి భార్యకు మెసేజ్ రావడంతో కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీస్లను ఆశ్రయించారు. రెండు రోజుల నుంచి అన్ని కోణాల్లో గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు పోలీసులు మచిలీపట్నం రైల్వేస్టేషన్లో ఎంపీడీవో బైక్ను, విజయవాడలోని ఏలూరు కెనాల్ వద్ద ఆయన చెప్పులను మాత్రమే గుర్తించారు. దీంతో ఆయన ఆదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. ఎంపీడీవో ఇంటికి క్షేమంగా రావాలని మండల పరిషత్ ఉద్యోగులతో పాటు సిబ్బంది, పట్టణ ప్రజలు కోరుకుంటు న్నారు. బకాయిపడ్డ ధవేజీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం మండల పరిషత్ ఆధికారులతో ఆయన చర్చించ లేదు. దీంతో బాకీ కడతారా ? లేదా అన్న దానిపై పెద్ద చర్చ సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa