ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పనులని పరిశీలించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 08:59 AM

డ్రైనేజీల పై సిమెంట్‌ శ్లాబ్‌లు వేసి ఆక్రమిస్తున్న తీరుపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మిలిటరీ రోడ్డులోని చీడీలపొర డ్రైన్‌, డీమార్ట్‌ ప్రాంతంలోని డ్రైనేజీల వద్ద పూడికతీత పనులను పర్యవేక్షించారు. చీడిల పొర వద్ద ప్రధాన డ్రైనేజీలో గుర్రపుడెక్క పేరుకుపోవడాన్ని గుర్తించి 2,3 రోజుల్లో తొలగింపు చర్యలు తీసుకోవాలన్నారు. డీమార్టు ప్రాంతంలో కొంతమంది డ్రైనేజీలపై సిమెంట్‌ శ్లాబ్‌లు వేయడంపై మండిపడ్డారు. వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని, లేకుంటే తామే తొలగించి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్‌లోని నమ్మటాయిలెట్స్‌ను పరిశీలించి నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన వెంట డీసీపీ హరిదాస్‌, ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ రాంబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్తెప్ప నాయుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa