అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..? ఇది ప్రమాదవశాత్తు జరిగినదా..? లేకుంటే కుట్రా..? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు..? అని తేల్చడానికి లోతుగా విచారణ జరుగుతోంది. ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది నుంచి ప్రాథమిక నివేదిక కోరిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్గా అనిపిస్తోందని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని.. కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa