ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై పోరాటానికి అన్ని పార్టీలతో కలిసి అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలకి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.కానీ ఈ సమావేశానికి మాత్రం ఏ పార్టీకి చెందిన నేతలు కూడా రావడానికి ఆసక్తి చూపలేదు.దీనితో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు గుర్రుమంటున్నారు.తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి జవహర్ ఏపీ ప్రతిపక్ష పార్టీపై మరియు జగన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.
వారు ఇలాంటి సమావేశాలకి ఎందుకు హాజరు కావట్లేదో అర్ధం కావట్లేదు అని తెలిపారు.తాను అయితే జగన్ పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఆయన ఫోటో కూడా చూడలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ లో అధికారం కావాలంటూ ఎక్కడో హైదరాబాద్ లో ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబే వారానికో ఎప్పుడో వెళుతున్నారని తెలిపారు.ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటే ఎవరూ ఇల్లు కూడా అద్దెకి ఇవ్వట్లేదేమో అందుకే ఆయన అక్కడ ఉంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa