ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, వ్యాపారులకు ముఖ్యమైన గమనిక. నాణేల విషయంలో ఆర్బీఐ ( భారతీయరిజర్వు బ్యాంక్) క్లారిటీ ఇచ్చింది. నాణేలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ఇకపై రూ.10 నాణేలు చెల్లదు అంటే కుదరదని.. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్నా సరే రూ.10 కాయిన్ చెల్లుతుందన్నారు. ఒకవేళ రూ.10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ తెలిపింది. ఎవరైనా అలాచేస్తే చట్టప్రకారం శిక్షార్హులని గతంలోనే పలుమార్లు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.10 కాయిన్ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదంటున్నారు.
ఎక్కువశాతం ఈ నాణేల సమస్య కూరగాయల వ్యాపారులు, కిరాణా, బడ్డీ కొట్లు, చిన్నచిన్న హోటళ్ల దగ్గర ఎదురవుతున్నాయి. వ్యాపారులు చిల్లర నాణేల కొరతతో ఇబ్బంది పడుతుంటారు.. అయినా సరే వారు రూ.10 కాయిన్ ఇస్తే మాత్రం తీసుకోబోమని చెబుతున్నారు. వ్యాపారులు బాగా పాతబడిన, నలిగిపోయిన రూ.10 నోటులు కూడా తీసుకుంటున్నారు.. కానీ పది నాణేలు మాత్రం వద్దని చెబుతున్నారు. చిన్న, చిన్న వ్యాపారులు మాత్రమే కాదు.. పెద్ద, పెద్ద మాల్స్లో కూడా ఇలాగే జరుగుతోంది.
ఈ ప్రభావంతో రూ.10 నాణేలు ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్ల్లో లక్షల్లో ఉంటున్నాయి. విజయవాడలోని ఓ బ్యాంక్ చెస్ట్లో ఏకంగా రూ.12 లక్షల విలువైన రూ.10 నాణేలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ కాయిన్స్ పెట్టేందుకు చోటులేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.10 నాణేలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడలోని మెయిన్ బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రీటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తోంది.
ఈ రూ.10 నాణేలు 2009 మార్చి - 2017 జూన్ మధ్య 14 సందర్భాల్లో విడుదలయ్యాయి. ఈ కాయిన్స్ సందర్భాల్ని బట్టి వివిధ డిజైన్లతో ఉన్నాయి. వాస్తవానికి రూ.10 నోట్ల మార్పిడి ఎక్కువ కాగా.. అవి చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయని చెబుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.పది నాణేలనూ ముద్రిస్తోంది. బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లను చెస్ట్లలో జమ చేస్తుంటారు. అక్కడి నుంచి అవి ఆర్బీఐకి పంపుతుంటారు.. ప్రజల్లో అపోహల వల్ల చిరిగిన నోట్లతో పాటు రూ.పది నాణేలనూ కూడా బ్యాంకు చెస్ట్లో జమ చేయాల్సి వస్తోంది. రూ.10 కాయిన్స్ చెల్లుతాయని 2016, 2018లో కూడా ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. రూ.10 నాణేల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అవి చెల్లుతాయని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. వ్యాపారులు కూడా రూ.10 కాయిన్స్ చెల్లుతాయని, వాటిని తీసుకోవాలని భారతీయ రిజర్వు బ్యాంకు సూచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa