ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 11:31 AM

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మాణం ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం అమరావతిలో రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతి రెండుసార్లు రాజధానిగా నిలబడిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పవిత్రమైన మట్టి, జలాలు తీసుకొచ్చి ఈ నేలలో పునీతం చేశామన్నారు. తిరుపతి, తిరుమల నుంచే కాకుండా ఇక్కడ కూడా ప్రజలకు ఆశీర్వాదం అందడం శుభకరమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa