ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం : రామ్‌నాథ్‌ కోవింద్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 11:40 AM

అవినీతి పాలన అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. 18 వేలకు పైగా గ్రామాల్లో విద్ద్యుదీకరణ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా లక్షలాదిమందికి నివాసం కల్పించామన్నారు. నవభారత్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చిందని ఆయన చెప్పారు. దివ్యాంగులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. మరుగు దొడ్ల నిర్మాణం ద్వారా మహిళల ఆత్మగౌరవం కాపాడామని ఆయన చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణాల ద్వారా 3 లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరిందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa