ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 11:53 AM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు పార్లమెంటు ముందు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 13 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, కంపెనీల సవరణ చట్టం బిల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు, జాతీయ పౌరసత్వ బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు కేంద్రం రెడీ అవుతుండగా, బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa