ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్‌ ఇండియాతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం : కోవింద్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 11:55 AM

న్యూఢిల్లి :  డిజిటల్‌ ఇండియాతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం, ఈ-గవర్నెన్స్‌ సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి కోవింద్‌ చెప్పారు. యువతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. కౌస్‌ వికాస్‌ యోఎజన కింద కోటిమందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చామని ఆయన చెప్పారు. ఉన్నత విద్యాభివృద్ధికి ఐఐటి, ఎన్‌ఐటి వంటి విద్యా సంస్థల సంఖ్య పెంచామని, ఆదివాసీ ప్రాంతాల్లో కూడా కేంద్రీయ విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని కోవింద్‌ చెప్పారు. నీలి విప్లవం ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సహాయం అందజేస్తున్నామని, కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడుతూ ఆనారోగ్యాలకు గురవుతున్న మహిళల కోసం ఉజ్వల యోజన ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa