పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవంతి ప్రొజెన్ఫుడ్స్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. ఏ విద్యార్హత లేని వారు, 18 నుంచి 35 సంవత్సరాల లోపు స్ర్తీ, పురుషులు, డిగ్రీ, పీజీ చదువుకున్న యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ముందుగా తమ వివరాలను హెచ్టీటీపీఎస్:// ఎస్ఐఎల్ఎల్యూఎన్ఐవీఈఆర్ఎస్ఈ.ఏపీఎస్ఎస్డీసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేకోవాలని సూచించారు. రిఫరెన్స్ నెంబర్తో పాటుగా రెజ్యూమ్, ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఒక పాస్పోర్టుసైజ్ ఫొటోతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ 63051 10947, 94947 77553 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa