ప్రపంచ దేశాలు భారతదేశం వైపు నేడు చూస్తున్నాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నాడు జరిపారు. జాతీయ పతాకాన్ని పురందేశ్వరి ఎగుర వేశారు. ఈ వేడుకల్లో వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ... దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రం తెచ్చారు. ఆ ఐకమత్యాన్ని పరి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఆనాడు నలభై కోట్లమంది దేశ ప్రజలు ఈ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్ల మంది ఉన్నారు. మన దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు’’ అని పురందేశ్వరి వెల్లడించారు. ‘‘కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటనే భావనతో ఉండాలి. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. వికసిత ఏపీ కోసం మనం అంతా కలిసి పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధికి అంకితమై ముందుకు సాగాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి తిరుగులేని అధికారం ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించింది. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్లో కూడా పెడతాం. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa