ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు జిల్లాలో పర్యటించిన భారత ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:22 PM

 భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ఉదయం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఘన స్వాగతం పలికారు. అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుని ప్రతిమకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహానికి కూడా జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించారు. ఆపై అక్షర విద్యాలయంలోని చిన్నారులతో ముచ్చటించారు. వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి తిలకించారు. ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అక్షర విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa