విజయనగరం సమీపంలోని లంకాపట్నం- రాళ్లమళ్లపురం గ్రామాల పరిధిలో రైల్వేట్రాక్ పై చిన్నహరిశ్చంద్ర పురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీష్(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు.. జగదీష్ విశాఖలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. విశాఖలో ఉండాల్సిన జగదీష్ విజయనగరం పరిధిలో విగత జీవిగా ఉండడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య? అనేది తేలాల్సి ఉంది. తండ్రి సూర్యారావు పెయింటర్, తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీ, చెల్లి డిగ్రీ చదువుతుంది. అవివాహితుడైన జగదీష్ మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని విజయనగరం పోస్టుమార్టంకు తరలించినట్లు అతని బంధువులు తెలిపారు. జగదీష్ మృతిపై విచారణ చేపట్టి నిజానిజాలు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa