దేశంలో ఎక్కడా లేనివిధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అచ్చెంనాయుడు అన్నారు. ఒక రాష్ట్రం, ఒక సిరీస్ విధానంతో అందరికీ ఆదర్శంగా నిలిచామని అన్నారు. నాలుగేళ్ల క్రితం రవాణా శాఖ అంటే చాలా చెడ్డ పేరు ఉంది. లైసెన్స్ లను అధికారుల నుంచి కాకుండా ఏజెంట్ల ద్వారా ప్రజలు పొందేవారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అటువంటి విధానాన్ని అరికట్టి సేవలను సరళీకృతం చేశాం అని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నామని అన్నారు.
ఒకే రాష్ట్రం, ఒకే సిరీస్ విధానాన్ని త్వరగా అందుబాటులో కి తేవడం వెనుక రవాణా శాఖ కమిషనర్, సిబ్బంది శ్రమ ఎంతో ఉందని అన్నారు.ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం కూడా వస్తుందన్నారు. ఎక్కడా పన్నులు పెంచకుండా..రవాణా శాఖ ఆదాయాన్ని పెంచామని అన్నారు.వేలి ముద్ర లు పడకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, అందువల్ల ఐరిస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు.
నేడు రవాణా శాఖ లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఇళ్లు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లి యల్.యల్.ఆర్ మేళాలు నిర్వహించామని అన్నారు.ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండేది.. ఇప్పుడు గంటలో యల్.యల్.ఆర్ ను ఇస్తున్నామని అన్నారు.అభయ యాప్ ను అందుబాటులోకి తెచ్చి రవాణా వాహనాల్లో ప్రయాణం చేసే మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని అన్నారు. అవినీతికి కేంద్రం గా ఉన్న రవాణా శాఖ ను నాలుగేళ్ల కాలంలో ఆదర్శ శాఖగా మార్చామని అన్నారు. ఎక్కడా అవినీతి కి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని అన్నారు.ఒకె రాష్ట్రం, ఒకే సిరీస్ విధానం నా హయాంలో రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అడిగిన వెంటనే అవసరమైన జివోలను విడుదల చేసేలా సిఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa