ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనమండలి తీర్మానం ప్రతులను చింపేసిన బీజేపీ ఎమ్మెల్సీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 07:24 PM

అమరావతి:  ఏపీకి విభజన హామీలను అమలుచేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా సమావేశంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తీర్మానం కాపీలను చింపేశారు. లోపభూయిష్టమైన తీర్మాన కాపీలుగా ఆరోపిస్తూ చింపేశారు. కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకున్నామని.. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభం అవుతాయని.. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంత నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ విషయంలో సహకారం లభించలేదని.. మంగళగిరి ఎయిమ్స్‌లో త్వరలో ఓపీ స్టార్ట్ అవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa