బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 23వ తేదీ సాయంత్రం రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ ధర్మంచర హాలులో అరిపిరాల నారాయణరావు రూపొందించిన అంత్యానుప్రాస నిఘంటువు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 24వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకూ జాతీయరహదారిని ఆనుకుని ఉన్న విద్యుత్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రముఖులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 25న ఉదయం పది గంటలకు కాకినాడలో జరిగే ఒక సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజమహేంద్రవరం చేరుకుని సాయంత్రం ఐదు గంటలకు ఎంపీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. 26వ తేదీ ఉదయం పది గంటలకు రాజమహేంద్రవరం క్వారీ ఏరియాలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యకర్తలతో జరిగే సమావేశంలో పాల్గొంటారని ఎంపీ కార్యాలయం వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa