ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌ|| ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గం,పుట్లూరు మండలం కడవకళ్లు గ్రామంలో గ్రామ సభలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు పాల్గొన్నారు.గ్రామ సభ ద్వారా ప్రజ సమస్యలను నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి గడపకు అందిస్తామని తెలిపారు.గ్రామపంచాయతీలను,గ్రామ సర్పంచులను నిర్వీర్యం చేసి,గ్రామ సర్పంచ్ అధికారం చెక్ పవర్ కూడా లేకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని,పంచాయతీ లో ఉన్న నిధులు మొత్తం దోచుకో దాచుకో అనే పని మీద జగన్ ఉన్నాడే తప్ప గ్రామాలు అభివృద్ధి చేయాలని ఒక్క రోజు కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదు చీకటిలో నుండి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెలుగులోకి వచ్చాం,ఉపాధి హామీ ద్వారా పనులను పూర్తి చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.గ్రామ సభలో ప్రతి ప్రజ సమస్య పరిష్కరించే దిశ గా ప్రతి ఒక్క శాఖ అధికారులు పని చేయాలని సూచించారు.
గ్రామ సభ లో ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని రాగా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తాo అని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa