అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరపున ఐదు లక్షలు ఇస్తున్నామని.. గాయపడిన వారికి లక్ష రూపాయలు సహాయం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎసెన్షియ ఫార్మా ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించారని తెలిపారు. యజమాని రావడంలేదని, చెప్పారు కాబట్టి ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారన్నారు. యాజమాన్యం సహకరించ లేదంటే ప్రభుత్వం అసమర్థతగా భావించాలంటారా..ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి? ఎలా అరికట్టాలని ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన, మాటలు పక్కన పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోఉన్న నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa