విజయవాడ నగరంలోని కోట్లాది రూపాయల విలువైన భూమి కోసం మృతుడు జయరాం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఒక గెస్టుహౌస్ లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జయరాం కు బీరులో సెనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహం నీలం రంగులోకి మారడంతో పోలీసులు కుట్ర కోణాలపై ఆరా తీస్తున్నారు. రక్తపు నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మృతి చెందినప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయినట్లు సమాచారం. దీంతో పోలీసులు జయరాం కుటుంబసభ్యులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa