విద్యార్థ్థలు, యువత పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. మంగళవారం దాసన్నపేట గురజాడ గ్రంథాలయం ఆవరణలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో విశాలాంధ్ర బుక్ హౌస్ ఎగ్జిబిషన్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ పాఠకుల్లో నేను కూడా ఒకరినని తెలిపారు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టమని, నేటి యువత విద్యార్థులు పుస్తకాలకు దూరమై సోషల్ మీడియాకు దగ్గరయ్యారన్నారు. సోషల్ మీడియా విజ్ఞానం కంటే, యువతను అజ్ఞానం, ఆశ్లీలతవైపు నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఏడీ రమేష్, తహసీల్దార్ కూర్మనాథరావు, గ్రంథాలయ కార్యదర్శి బి.లక్ష్మి, సీపీఐ ప్రతినిధులు జి ఈశ్వరయ్య, కామేశ్వరరావు, ఒమ్మి రమణ, బుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa