ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల అడుగులు 100 సంవత్సరాల దేశ, రాష్ట్ర భవిష్యత్తు వైపుకే అని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల డబుల్ ఇంజన్ సర్కార్ గమనం కేంద్రంలో వికసిత భారత్, రాష్ట్రంలో వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం సుస్పష్టంగా కనిపిస్తోందన్నారు.ప్రధాని మోడీ దేశంలో 15 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల లక్ష్యంగా 100 రోజుల్లో మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని తెలిపారు. 100 రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేశారన్నారు. 100 రోజులలో రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీలకు ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేశారని తెలిపారు. దేశంలో పేదలకు 3 కోట్ల కొత్త గృహాల నిర్మాణం, 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగింపు, మహిళలను లాక్ పతి దీదీలుగా అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అడుగులు వేశారని చెప్పుకొచ్చారు. 100 రోజులలో అన్న క్యాంటీన్లతో పేదలకు ఆహారం, అర్హులైన వారికి రూ.4000 పెన్షన్, అకాల వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవడం వంటి సేవలను సీఎం చంద్రబాబు అందించారన్నారు. దేశం మొత్తం 2030 నాటికి ప్రధాని గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల లక్ష్యం 30 లక్షల కోట్లయితే అందులో 10 లక్షల కోట్లు ఏపీ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించడం శుభపరిణామమని లంకా దినకర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa