పలాస నియోజకవర్గంలో సీనియర్ టీడీపీ నాయకుడు వజ్జ బాబూరావుకు ‘ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్’కు చైర్మన్గా నియమించారు. జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రాధాన్యమివ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రథమ చైర్మన్గా ఆయన వ్యవహరించారు. 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై.. కాంగ్రెస్పార్టీ తరపున టెక్కలి నియోజవకర్గం నుంచి పోటీ చేశారు. 2002లో మునిసిపల్ చైర్మన్గా వ్యవహరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస బరిలో వైసీపీ నుంచి పోటీ చేశారు. 2017 సంవత్సరం నుంచి టీడీపీలో చేరి పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సార్వత్రిక పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు విజయానికి విశేషంగా కృషి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa