కొత్తగా పార్టీలోకి వచ్చేవారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లెపల్లెకూ జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గురువారం జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
వారితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యువజన విభాగం విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అవనపు భావన కూడా పార్టీలో చేరారు. చేరికల అనంతరం పార్టీ కార్యాలయం వెలుపలకు వచ్చిన పవన్ను కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa