పెళ్లింట విషాదం నెలకొంది. వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరగనుండగా.. కార్డులు ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తుండగా కుమార్తె తండ్రిని లారీ రూపం మృత్యువు కబలించింది. స్థానికులు, కు టుంబ సభ్యుల కథనం మేరకు.. టెక్కలి మండలంలోని అక్కవరం పంచాయతీ శ్యామసుం దరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు కుమార్తె హిమావతికి ఈనెల 20న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో బంధువులు, స్నేహితులకు కబుర్లు చెప్పేందుకు కుటుంబ సభ్యులు తలమునకలయ్యారు.
ఇందులో భాగంగా ఆదివారం తండ్రి మోహనరావు పెళ్లికార్డులు ఇచ్చేందుకు విక్రాంపురం సైకిల్పై వెళ్లి తిరిగి వ స్తున్నాడు. ఆ సమయంలో జాతీయ రహదారిపై విక్రాంపురం వద్ద శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో కిందపడిపోయాడు. అయితే మోహనరావు కు చిన్నపాటి గాయాలయ్యాయని, లారీ డ్రైవర్ కొంతసేపు ఆపాడు. తరువాత లారీ పలాస వైపు వెళ్లిపోయింది. ఈలోగా స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి మోహన రావును తరలించగా చికిత్స పొందుతూ మోహనరావు మృతిచెందాడు. ఆయనకు భార్య మాలతి, కుమారుడు చరణ్, కుమార్తె ఉన్నారు. మరో వారం రోజుల్లో జరిగే పెళ్లి ఇంట విషాదం జరగడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa