విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలంలోని సంతోష పురం పంచాయతీ పిట్టలమెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు కథనం మేరకు.. బుధవారం వీరఘట్టం నుంచి వస్తున్న ఆటోను పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటోలో ఉన్న వీరఘట్టంలోని డౌన్ స్ర్టీట్ కాలనీకి చెందిన యండవ యశోదమ్మ (47) రహదారికి ఆనుకుని తుప్పల్లోకి తుళ్లిపడింది. దీంతో ప్రమాద స్థలంలో ఆమె మృతి చెందింది. కళ్లజోళ్లను బాగు చేయించుకోవడానికి పార్వతీపురం వెళ్తుండగా ఈఘటన జరిగింది.
ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యశోదమ్మ మృతితో రఘట్టంలోని డౌన్ స్ర్టీట్ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త వెంకట్, కుమార్తె వెంకటలక్ష్మి ఉన్నారు. భర్త వెంకట్ కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa