టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయన వయస్సు 99 ఏళ్లు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టికెట్ రాకపోవడంతో ఇండిపెండింట్గా పోటీ చేశారు. 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజవర్గం నుంచి గెలుపుపొందారు. అక్కడి నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది.1983, 1985,1989, 1994, 1999 అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు రెడ్డి సత్యనారాయణ. టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.చంద్రబాబు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్గా, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆ తర్వాత వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa