జగన్, నీకు రాజకీయాలు చేతకాదు. పార్టీని రద్దు చేసి ఇంట్లో కూర్చో అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తనదైన శైలిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లి, చెల్లిపై కేసులు వేయడం, సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన నీకు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తుంటే నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు. తండ్రి మరణిస్తే శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం పదవీ కోసం సంతకాల సేకరణ చేయించి, శవరాజకీయాలు చేసి నీవా చంద్రబాబు గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. జగన్ గత చరిత్ర.. ప్రస్తుత పరిస్థితి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్కు సిగ్గురాలేదని ఎద్దేవ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ములేని దద్దమ్మకు రాజకీయాలు అవసరమా? అన్నారు. ఇకపై చంద్రబాబు, మంత్రి లోకేశ్పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజల మధ్య తిరగకుండా చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa