విల్లుపురం జిల్లా విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడుకు స్థలమిచ్చిన రైతులను శనివారం ఉదయం ఆ పార్టీ నేత, నటుడు విజయ్ ఘనంగా సత్కరించారు. అదే సమయంలో అందరికీ ప్రత్యేక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. విక్రవాండి మహానాడు కోసం వి.సాలై వద్ద సుమారు 170 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అక్కడి పంటలు పండించే రైతులు అనుమతించిన విషయం తెలిసిందే. అక్కడ జరిపిన పార్టీ మహానాడు ఘన విజయం సాధించడంతో స్థలమిచ్చిన రైతులను ఘనంగా సత్కరించాలని విజయ్ నిర్ణయించారు.
ఆ మేరకు పనయూరులో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. రైతులకు విందునిచ్చేందుకు అనువుగా తగిన సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీఆనంద్ తదితర పార్టీ ప్రముఖులతోపాటు విజయ్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రైతులందరినీ శాలువలతో సత్కరించి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత రైతులందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన శాఖాహార వంటకాలను వడ్డించారు. ఆ సందర్భంగా విజయ్ రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, చేతులు ఊపుతూ వేగంగా నడచుకుంటూ కారెక్కి అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa