మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రతినిత్యం పోలవరం పై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014-2019 తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ -1, ఫేజ్ -2, అని గానీ, ఎత్తు తగ్గింపు అని గానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాలు విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోక ముడిచారంటూ వ్యాఖ్యలు చేశారు.నేడు పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారానికి, మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని అన్నారు. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం పడింది, వేసింది, వైసీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. 45.72 మీటర్ల కు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడం అనే ప్రతిపాదన 2021లో జగన్ ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టిందన్నారు. ప్రధాన డ్యామ్లో 41.15 మీటర్ల ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయాలనే నిర్ణయం ప్రతిపాదన తీసుకున్నది జగన్ ప్రభుత్వమే అని పీపీఏ తేల్చి చెప్పిందన్నారు.
![]() |
![]() |