జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పాకిస్థాన్కు చెందిన ఓ చొరబాటుదారుడు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. మహ్మద్ సాదిక్ (18) అనే యువకుడు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు అతడిని తనిఖీ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa