ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాళాలను వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:44 PM

ఎలమంచిలి స్థానిక రామ్మూర్తినగర్‌ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఎక్సైజ్‌ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఇంటి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి, నాలుగు లక్షల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం ఆభరణాలను అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయిన బీవీ రమణ స్థానిక రామ్మూర్తినగర్‌ ప్రాంతంలో నివాసం వుంటున్నారు. రెండు అంతస్థుల భవనంలో కింద రెండు పోర్షన్లు అద్దెకు ఇవ్వగా, పై అంతస్థులో రమణ కుటుంబ నివాసం వుంటున్నది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో వుంటున్న కుమార్తె వద్దకు గత మంగళవారం వెళ్లారు. సోమవారం ఉదయం పనిమనిషి వచ్చి, మెట్లమార్గానికి వున్న గేటు తాళం తీసివుండడాన్ని గమనించింది. ఈ విషయాన్ని అద్దెకు వుంటున్న వారికి చెప్పగా, అందరూ కలిసి మేడ మీదకు వెళ్లారు. ఇంటి తలుపులు తీసి వుండడంతో పట్టణంలోనే నివాసం వుంటున్న రమణ సోదరుడు గోవిందరాజులుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన వెంటనే వచ్చి ఇంటిలోపలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం రమణకు ఫోన్‌ చేసి చోరీ జరిగిన విషయం చెప్పారు. ఇంటిలో భద్రపరిచిన నాలుగు లక్షల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం ఆభరణాలు కనిపించడంలేదని గుర్తించారు. ఈ మేరకు రమణ తరపున ఆయన సోదరుడు గోవిందరాజులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతోపాటు అనకాపల్లి నుంచి క్లూస్‌ టీమ్‌వచ్చి ఆధారాలు సేకరించింది. చోరీ సంఘటనపై పట్టణ ఎస్‌ఐ సావిత్రిని వివరాలు కోరగా.. చోరీ జరిగినట్టు ఫిర్యాదు అందిందని, ఇంటి యజయాని వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa