ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిశ్రమలో తనిఖీలు చేపట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 04:15 PM

కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెదజల్లుతోందని అన్నారు.


చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa