ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వం రాకతో ఆర్యవైశ్యలకి కష్టాలు తొలిగిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:30 PM

వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోందని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్య పదం వినపడితే చాలు జగన్‌ చిరాకుపడిపోయేవారని, ఆర్యవైశ్య సంఘాలను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆలయాలను, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని, ఆర్యవైశ్యుల వ్యాపారాలను దెబ్బతీశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కష్టాలన్నీ కడతేరాయన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా, వాసవీ అమ్మవారికి సీఎం హోదాలో చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనుండటం ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. పెనుగొండలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జనవరి 31న సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa