రాష్ట్రంలో గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపామని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆయన పర్యటించారు. ముందుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఒకటో డిపోని సందర్శించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. డీఐజీ గోపినాథ్ జట్టి, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. ‘గడిచిన ఏడు నెలల్లో శ్రీకాకుళం జిల్లా పోలీసులు అత్యుత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధించడం అభినందనీయం. ప్రజలకు పారదర్శకమైన సేవలందించి పోలీసుశాఖ కీర్తిని పెంపొందించాలి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సైబర్ నేరాలు ఛేదించాలి. బిహార్ సుఫారీ గ్యాంగ్తో సహా ఆలయాల్లో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులను ఛేదించి ప్రోపర్టీ రికవరీ చేయడం జిల్లా పోలీసుల ప్రతిభకు నిదర్శనం. ఇదే స్ఫూర్తితో పెండింగ్ కేసులు త్వరితగతిన ఛేదించాలి’ అని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీపీ కొబ్బరి మొక్కను నాటారు. ఆయనకు ఎస్పీ దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa