ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై పవిత్ర స్నానం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రధాని మోదీ గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలానికి చేరుకోవడానికి సీఎం యోగితో కలిసి పడవలో సంగం ఘాట్కు చేరుకున్నారు. మోదీ సంగం ఘాట్కు చేరుకున్న వెంటనే, మోదీ మోదీ అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.