అమరావతి....అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో చంద్రబాబు బేటీ అయ్యారు. డేటాచోరీ ఆరోపణలు వస్తుండటంతో ఆదివారం అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై సమీక్షించించారు. అంతకుముందు గుంటూరు పార్లమెంట్ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో టికెట్ లపై చర్చించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి నియోజకవర్గలలోని నేతలతో మాట్లాడారు. రేపు మరోసారి నేతలతో భేటీ అవనున్నట్టు సమాచారం. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa