మా నాయకులు వైయస్ జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత కూటమి నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ.... కూటమి నేతల కూసాలు కరిగి మతిభ్రమించి మాట్లాడారు, నిజాలు సహించలేకపోతున్నారు, జగన్ గారు వాస్తవాలు చెప్పగానే కూటమి నాయకుల కడుపుమంట బయటపడింది, జగన్ పూర్తిగా అధ్యయనం చేసి అన్నీ ఆధారాలతో మీడియాతో మాట్లాడతారు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలకే పరిమితమవుతారు, కూటమి నాయకులు ఫేక్ న్యూస్ సృష్టించి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఇప్పటివరకూ 11 ప్రెస్ మీట్లు పెట్టారు, తిరుపతి లడ్డూ వివాదం నుంచి సెకీ వరకు, బడ్జెట్ లోపాలపై అన్నీ ఆధారాలతో మాట్లాడారు, చంద్రబాబు ఒక్క ప్రెస్ మీట్ అయినా ఆధారాలతో పెట్టారా, మీకు వాస్తవాలు చెప్పే దమ్ముందా, చంద్రబాబు నేను నిప్పు అని అంటుంటారు, ఐటీకి పితామహుడిని నేనే అంటారు, కానీ ఆయనకు కనీస జ్ఞానం లేదా, మీ అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు, అందుకే ఆయన ఆధారాలు చూపరు. జగన్ ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు ఒక్కరైనా సమాధానం చెప్పారా, సూపర్ సిక్స్ అమలుపై ఎవరి కాలర్ పట్టుకుని నిలదీయాలి, చంద్రబాబు ఈ 9 నెలల్లో రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారు, మరి ఆ డబ్బుతో ఒక్క బటన్ ఐనా నొక్కారా, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వారిని తొలగించారు, ఇది విధ్వంస పాలన కాదా, జగన్ గారు బటన్ నొక్కి రూ. 2.73 లక్షల కోట్లు పంపిణీ చేసింది వాస్తవం కాదా, మరి మీరెందుకు నొక్కడం లేదు సమాధానం చెప్పండి. జగన్ వాస్తవాలు, గణాంకాలు, నివేదికలు చూసి చెబితే మీరు అంగీకరించలేరా, లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పేరు రాశారు, ఆయనకు లిక్కర్ కి ఏం సంబంధం, ఇలాంటి కేసులు నిలబడతాయా, కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నాం, జగన్ ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పండి, కారుకూతలు మానుకోండి అని హితవు పలుకుతున్నాను అని అన్నారు.